Emergency Landing: విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండ్.. ప్రయాణికుడి మృతి
కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది...
ఇండోర్: కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే విమానాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విస్టారా విమానం యూకే- 818 గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి దిల్లీకి బయల్దేరింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న దిల్లీకి చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. కొద్ది సేపటికే మూర్చపోవడంతో.. ఈ మేరకు సమాచారం అందుకున్న పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించారు.
రాత్రి 9.30 గంటల సమయంలో ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో మెడికల్ ఎమర్జెన్సీ కింద ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జి డైరెక్టర్ ప్రమోద్ కుమార్ శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోందని ఆ ఆసుపత్రి డైరెక్టర్ డా.సునీల్ బాంతియా చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఏరోడ్రోమ్ పోలీస్స్టేషన్ అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా