హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి
కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా
కొడుకును హతమార్చిన తండ్రి, కుటుంబసభ్యులు
కోడలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
ఏసురత్నం (పాత చిత్రం)
పర్చూరు, న్యూస్టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో కొడుకు హత్యకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు చెరిపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లక్ష్మీభవాని తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం(28) అదే గ్రామానికి చెందిన నీలిమ ప్రియాంకను 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఏసురత్నం కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కొంతకాలం తర్వాత కలిసే ఉంటున్నారు. నీలిమ, ఏసురత్నం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. మద్యానికి అలవాటైన ఏసురత్నం భార్య, కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. ఈనెల 15న మద్యం సేవించి గొడవపడటంతో భార్య ఏదుబాడు వచ్చింది. 17న తల్లితో కలిసి మేదరమెట్లలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లింది. భార్య కోసం 18వ తేదీ మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చిన ఏసురత్నం గ్రామంలో లేకపోవడంతో తండ్రి వద్దకు వెళ్లాడు. భార్యను తీసుకురావడానికి తండ్రిని రమ్మని కోరాడు. మద్యం సేవించి గొడవ పడుతుంటే ఎలా వస్తారని అని తండ్రి అనడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో కుమారుడిపై తండ్రి బాపయ్యతో పాటు కుటుంబసభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల, ఇతర శరీర భాగాలలో బలమైన గాయాలయ్యాయి. కొద్దిసేపటికే ఏసురత్నం మృతి చెందాడు. హత్య చేసినట్లు అనుమానం వస్తుందనే భయంతో శరీరంపైనా, గదిలోనూ కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేశారు. మేదరమెట్లలో ఉంటున్న మృతుని భార్య నీలిమా ప్రియాంకకు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి పురుగుమందు తాగి చనిపోయినట్లు ఆమె మామ సమాచారం అందించారు. బంధువులతో కలిసి గ్రామానికి వచ్చిన నీలిమ భర్త శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆందోళనకు గురై నిలదీసింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో పర్చూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్సై లక్ష్మీభవాని వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గురువారం ఉదయం ఇంకొల్లు సీఐ సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రులతో పాటు అతని సోదరి, బావపై హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై లక్ష్మీభవాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు