Hyd News: వైద్యుడి వేషంతో ఐసీయూలోకి అక్రమంగా ప్రవేశించి..
వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.
Updated : 21 May 2022 06:47 IST
పంజాగుట్ట, న్యూస్టుడే: వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో చేర్చించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈనెల 16న గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి వేషధారణతో ఐసీయూలోకి వెళ్లాడు. రోగి కేసష్ీట్ను పరిశీలించి ఫోన్ నంబరు తీసుకున్నాడు. రోగి బంధువులకు ఫోన్ చేసి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, తక్షణం రూ.50వేలు పంపించాలని చెప్పాడు. విస్తుపోయిన బంధువులు తమకు ఈఎస్ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఆసుపత్రి యాజమాన్యం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుణ్ని సంతోష్నగర్కు చెందిన మహ్మద్ జకీరుద్దీన్(19)గా గుర్తించి రిమాండ్కు తరలించారు.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!
బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. -
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
నగర శివారు బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
ప్రేమించిన యువతితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతోనే ఫోన్ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
గుజరాత్లోని దాహోద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం లోపల నుంచి వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక భాజపా నాయకుడి కుమారుడైన విజయ్ భాభోర్.. పోలింగ్ కేంద్ర లోపల నుంచి ఇన్స్టా లైవ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
కేరళలో ఏనుగు దాడి.. కెమెరామన్ దుర్మరణం
కేరళలో గుంపు నుంచి తప్పిపోయిన అడవి ఏనుగు దాడిలో ఎ.వి.ముకేశ్ (34) అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ప్రముఖ న్యూస్ ఛానల్ ‘మాతృభూమి’ కెమెరామన్గా, కాలమిస్ట్గా పనిచేస్తున్న ముకేశ్ రిపోర్టరుతో కలిసి మలమ్పుఝా - కంజికోడ్ మార్గంలో నదిని దాటే ఏనుగుల గుంపు దృశ్యాల చిత్రీకరణకు వెళ్లాడు. -
అత్యాచారం కేసు నిందితుడు 40 ఏళ్ల తర్వాత దొరికాడు
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుడిని 40 ఏళ్ల తర్వాత అరెస్టు చేసిన ముంబయి పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. ముంబయికి చెందిన పాపా అలియాస్ దావూద్ 1984లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
ఈవీఎంలలో చిప్ మారుస్తా.. మిమ్మల్ని గెలిపిస్తా
డబ్బులిస్తే ఈవీఎంలలో చిప్ను మార్చి ఎక్కువ ఓట్లు పడేలా చేస్తానని మోసగించేందుకు యత్నించిన ఓ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM