తెనాలిలో క్రికెట్ బుకీ అరెస్టు
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో ..
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు
తెనాలి టౌన్, న్యూస్టుడే: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.స్రవంతిరాయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉప్పుబజార్లో ఉన్న ఓ ఇంటిలో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ నమోదుల ప్రధాన బుకీ జి.వెంకట్, అతని సహాయకుడు వెంకటేష్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్ట్యాప్, 8 స్మార్ట్ఫోన్లు, 9 కీప్యాడ్ ఫోన్లను కలిగి ఉన్న లైన్ బాక్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట్ గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాల విశ్లేషణ తర్వాత ఇందులో ఎంత మంది పాల్గొన్నారు? వారు ఎవరు? ఏమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.. తదితర సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వన్టౌన్ పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, చాణక్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రధాన నిందితుడు వెంకట్ బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ అతని సిబ్బంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు