ప్రొద్దుటూరులో దారిదోపిడీ ముఠా బీభత్సం

మండల పరిధిలో దారి దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. కారులో వెళ్తున్న ఇద్దరిపై దాడి చేసి బంగారం, డబ్బు దోచుకెళ్లారు. గ్రామీణ ఠాణా ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం పట్టణం వేణుగోపాల నగర్‌కు చెందిన వెతంగే తుకారం రావు

Updated : 21 May 2022 04:57 IST

దాడి చేసి బంగారం, డబ్బుతో పరారు


దుండగుల దాడిలో గాయపడ్డ వెంకటేశ్వరరావు, తుకారంరావు

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మండల పరిధిలో దారి దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. కారులో వెళ్తున్న ఇద్దరిపై దాడి చేసి బంగారం, డబ్బు దోచుకెళ్లారు. గ్రామీణ ఠాణా ఎస్సై సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం పట్టణం వేణుగోపాల నగర్‌కు చెందిన వెతంగే తుకారం రావు ఆయుర్వేద ఫార్మసీ ప్రొప్రైటరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు ఇసుక దిన్నెల్లో నివాసం ఉంటున్న ఓ చిన్నారికి మూగ, చెవుడుకు సంబంధించిన ఆయుర్వేద మందులు అవసరం అయ్యాయి. దీంతో ఆ మందులు ఇచ్చేందుకు గురువారం రాత్రి తుకారంరావు తన అన్న హంచాటే శివ వెంకటేశ్వరరావుతో కలిసి కారులో అనంతపురం నుంచి ప్రొద్దుటూరు వచ్చారు. తిరుగు ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం దాటాక కారు టైరు పంక్చర్‌ కాగా.. టైరును పరిశీలిస్తుండగా.. 25ఏళ్ల వయసున్న ఐదుగురు దుండగులు తెలుగు, ఉర్దూ మాట్లాడుతూ వచ్చి తుకారంరావును కొట్టి మెడలోని రెండు తులాల బంగారం గొలుసు, రూ.19 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు లాక్కొన్నారు. వెంకటేశ్వరావుపై కర్రలతో దాడి చేసి అతని నుంచి రూ.1200 నగదుతో పాటు చరవాణి తీసుకుని పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని