మరో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

రాష్ట్రంలో మరో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు బుధవారం బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఎంపీసీ ప్రథమ

Published : 30 Jun 2022 05:50 IST

నిజామాబాద్‌ నేరవార్తలు, చాదర్‌ఘాట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు బుధవారం బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 5 సబ్జెక్టులు తప్పిన భయంతో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ‘పరీక్షల్లో ఫెయిల్‌ అయిన భయంతోనే ఆత్మహత్య చేసుకొన్నట్లు తమ విచారణలో తేలిందని’ ఎస్సై తెలిపారు. హైదరాబాద్‌ న్యూ మలక్‌పేట ప్రాంతానికి చెందిన విద్యార్థిని (19) ఇంటర్‌లో పాస్‌కాకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది.

బలవన్మరణాలకు పాల్పడొద్దు: సంజయ్‌
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడొద్దు, తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని