Andhra News: తండ్రీకుమారుల దాడి.. వార్డు వాలంటీర్ మృతి
తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్పై తండ్రీకుమారులు దాడి చేసిన
తెనాలి: తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్పై తండ్రీకుమారులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్పేటలో చోటుచేసుకుంది. ఈ దాడిలో వాలంటీర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి పట్టణంలోని 24వ వార్డుకు వాలంటీర్గా పనిచేస్తున్న సందీప్ (22) నుంచి ఓ బాలుడు రెండు నెలల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తమకు డబ్బులు అవసరమయ్యాయని తిరిగి ఇవ్వాలని వాలంటీర్ అడగగా బాలుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మాటా మాటా పెరిగి ఇరువైపులా దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో బాలుడు, అతడి తండ్రి వెంకటేశ్వర్లు సందీప్ గుండెపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని బంధువులు మారిస్పేటలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. సందీప్ తండ్రి ఇదివరకే మృతి చెందారని.. తల్లికి మాటలు రావని స్థానికులు తెలిపారు. కుటుంబ పోషణ సందీపే చూసుకుంటున్నాడని.. ఓ పక్క వాలంటీర్గా ఉంటూ ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్