Kids Health: మీ పిల్లలతో వ్యాయామం చేయించండిలా!
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
ఇంటర్నెట్ డెస్క్: వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
వారి శరీరానికి కూడా వ్యాయామం అవసరం. పిల్లలు ఎక్కువగా తరగతి గదిలో గంటలపాటు కూర్చుని ఉండిపోతారు. ఈ కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. గంటల తరబడి ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యాయామం సంగతేంటి? ఇలా చేసి చూడండి
వీటిని కొనివ్వండి
సాధారణంగా పిల్లలకు బొమ్మలను కొనిస్తూనే ఉంటారు. వాటికి బదులుగా వారికి ఉపయోగపడేలా స్కిప్పింగ్, బాడ్మింటన్ రాకెట్ లాంటి ఆట పరికరాలను కొనివ్వండి. ఇలా చేయడం వల్ల వారికి బోర్గా అనిపించకుండా వీటితో ఆడుకుంటారు.
విహార యాత్రకు వీటినీ తీసుకెళ్లండి
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లాలనుకుంటే సెలవు రోజుల్లో కొంత విభిన్నంగా ప్రణాళికలను రూపొందించండి. స్విమ్మింగ్, మౌంటెన్ బైకింగ్ ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దీంతో ప్రకృతితో వారు మమేకం కాగలరు. ఇటువంటివి చేయడం అలవాటుగా చేసుకుంటే ఆనందకర కుటుంబాన్ని పొందగలరు.
ఇంటి పనులు చేసేలా ప్రోత్సహించండి
ఇంటిలో పనులకు పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లిదండ్రులు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించాలి. వారు పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. పనులు చేస్తుంటే వారి శరీరానికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది.
టీవీ టైమ్ను తగ్గించండి
టీవీ చూస్తే కుటుంబం అంతా కలిసి చూడండి. వారికి రిమోట్ ఇచ్చేసి వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు గంటల తరబడి తెరను చూస్తూనే ఉంటారు. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా మీరు పిల్లలతో ఆడుకోండి. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు వారితో సమయం గడపకుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు.
ఈ కొద్ది పాటి మార్పులు చేసుకొని పిల్లలను వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు