Health: అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహారమిదే
అధిక రక్తపోటు మందులు వాడితే తగ్గిపోతుందిలే అనుకునే వారు అధికంగా పెరిగిపోయారు. ఉప్పు తగ్గించినా చాలు అనుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: అధిక రక్తపోటు మందులు వాడితే తగ్గిపోతుందిలే అనుకునే వారు అధికంగా పెరిగిపోయారు. ఉప్పు తగ్గించినా చాలు అనుకుంటారు. సరయిన వ్యాయామం, ఆహార నియమాలు పాటించకపోవడంతో అది తీవ్రరూపం దాల్చుతోంది. కేవలం మందులతోనే కాకుండా చక్కని ఆహారపు అలవాట్లను అలవర్చుకున్నట్లయితే అధిక రక్తపోటు అదుపు పెట్టుకోవచ్చని పోషకాహార నిపుణురాలు అంజలీదేవి సూచిస్తున్నారు.
* ఉప్పును వయసుకు తగినట్టు తినాలి. ఆరోగ్యకరంగా ఉన్నవారు రోజుకు ఐదు గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, వయసు మళ్లిన వారు తక్కువ ఉప్పు వాడాలి.
* దుంప కూరలు తగ్గించాలి. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వుగా మారుతుంటాయి.
* మేక, కోడి కూరల్లో ఉండే కొవ్వు నేరుగా గుండె రక్త కణాల్లో పట్టేస్తుంది. నరాల పరిమాణం తగ్గిస్తుంది. దీంతోనే రక్తపోటు వస్తుంది. కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తినాలి.
* 20-30 గ్రాముల నూనె, నెయ్యి, వెన్న మాత్రమే రోజుకు వినియోగించాలి. అంతకంటే ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకొని పోతుంది.
* గానుగ పట్టిన నూనెలను తెచ్చుకొని వాడాలి. వాటి ధర అధికంగా ఉండటంతో సహజంగానే వాటిని తక్కువగా వినియోగిస్తాం.అప్పుడు కావాల్సినంత శరీరానికి పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM