Andhra News: ప్రతి 2వేల జనాభాకు ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్: కృష్ణబాబు
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు.
అమరావతి: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు 8 మందికి అమర్చే అవకాశముందన్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిర్వహించిన జీవన్దాన్ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేటర్లుగా శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు. అవయవదానంపై ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేటర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబసభ్యులకు ఓపిగ్గా కౌన్సెలింగ్ నిర్వహించి వారి కుటుంబసభ్యులను ఒప్పించాలని స్పష్టం చేశారు.
జీవన్ దాన్ కార్యక్రమం కింద హార్వెస్టెడ్ ఆర్గాన్స్ అన్నింటినీ ఏపీ ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించాలని కృష్ణబాబు సూచించారు. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కళాశాలలతోపాటు మరో 16 మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హెల్త్ హబ్లకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయిస్తోందన్నారు. వైద్య, ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ 2వేల జనాభాకు ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్ అందుబుటో ఉండేలా రాష్ట్రంలో 10వేలకు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వైద్యారోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుందని కృష్ణబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్