Shocking Incident: నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..

రాజస్థాన్‌లోని కోటలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న 38 ఏళ్ల ఓ వ్యక్తిపైకి ఓ మొసలి అకస్మాత్తుగా....

Published : 19 May 2022 02:31 IST

(ఫైల్‌ ఫొటో)

కోట: రాజస్థాన్‌లోని కోటలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న 38 ఏళ్ల వ్యక్తిపైకి ఓ మొసలి అకస్మాత్తుగా దూసుకొచ్చింది. అతడిపై దాడి చేసి నదిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ ఘటన ఖటోలి పట్టణంలో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. బిల్లూ అనే వ్యక్తి ఖటోలి పట్టణంలోని పార్తి నదిలో రామ్‌ఘాట్‌ వద్ద ఉదయం స్నానానికి దిగాడు. నదిలో ఉన్న ఓ మొసలి అతడిపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అతడిని లోపలికి లాక్కెళ్లిపోయింది. దీంతో నదిలో స్నానం చేస్తున్న మిగతా వ్యక్తులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కోట నుంచి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం వచ్చి సహకరించాలని స్థానిక అధికారులు కోరారు. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. చెరువులో స్నానానికి దిగిన ఓ చిన్నారిని మొసలి అమాంతం పట్టుకొని బలితీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని