బెంగళూరులో వర్ష బీభత్సం
భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు 114.6 మి.మీ. నమోదైంది.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే: భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు 114.6 మి.మీ. నమోదైంది. రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్యలోనే 100 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ‘నగరంలో గరిష్ఠంగా 90 మి.మీ. వర్షపాతం నమోదైతే నీరు నిలవకుండా కాలువల ద్వారా వెళుతుంది. అంతకు మించి వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు నిలిచిపోతుంది’ అని బెంగళూరు పాలికె ప్రధాన కమిషనరు తుషార్ గిరినాథ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో వాహన సంచారం అస్తవ్యస్తంగా మారిపోయింది. చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 4అడుగుల మేర నీరు నిలిచి.. వాహన సంచారానికి ఆటంకం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..