ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీకి బుధవారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ

Published : 19 May 2022 05:27 IST

షీనా బోరా హత్య కేసులో సుప్రీం నిర్ణయం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీకి బుధవారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ త్వరలో ముగిసే అవకాశం కనపడటంలేదని, ఆమె ఆరున్నరేళ్లు(2015 నుంచి)గా జైల్లో ఉండటం సుదీర్ఘ కాలమని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో మొత్తం 237 మంది సాక్షులను విచారించాల్సి ఉండగా ఇప్పటివరకు 68 మందినే ప్రశ్నించారని, మిగతా వారి ప్రాసిక్యూషన్‌ పూర్తికి ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని