మేరఠ్‌ పేరును గాడ్సే నగర్‌గా మార్చాలి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ పేరును నాథూరామ్‌ గాడ్సే నగర్‌గా మార్చాలని హిందూ మహాసభకు చెందిన ఆ రాష్ట్ర శాఖ డిమాండ్‌ చేసింది. ఆ నగరంతో గాడ్సేకు, అతడి కుటుంబానికి సన్నిహిత

Published : 20 May 2022 05:57 IST

 హిందూ మహాసభ యూపీ శాఖ డిమాండ్‌

 గాంధీ హంతకుడి జయంతి రోజున ప్రత్యేక పూజలు

మేరఠ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ పేరును నాథూరామ్‌ గాడ్సే నగర్‌గా మార్చాలని హిందూ మహాసభకు చెందిన ఆ రాష్ట్ర శాఖ డిమాండ్‌ చేసింది. ఆ నగరంతో గాడ్సేకు, అతడి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపింది. గురువారం గాడ్సే జయంతి సందర్భంగా మేరఠ్‌లోని హిందూ మహాసభ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ వ్యతిరేక గాంధీవాదాన్ని నిర్మూలిస్తామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని