India Corona : 15 వేల దిగువకు క్రియాశీల కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో 3 వేల దిగువనే నమోదవుతున్నాయి. మరోవైపు గత కొన్ని

Published : 21 May 2022 10:12 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో 3 వేల దిగువనే నమోదవుతున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండం సానుకూలాంశం. దీంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ 15 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాలు కూడా గత కొన్ని రోజులుగా 30 లోపే నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* నిన్న నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలు సంఖ్య : 4,99,382
* కొత్తగా నమోదైన కేసులు : 2,323
* నిన్న చోటుచేసుకున్న మరణాలు : 25 ( మొత్తం మరణాలు 5,24,348)
* శుక్రవారం కోలుకున్న వారి సంఖ్య : 2,346
* ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య : 4.25 కోట్లు (98.75%)
* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య : 14,996  (0.03%)
* నిన్న పంపిణీ చేసిన టీకాలు : 15,32,383 ( మొత్తం డోసుల సంఖ్య 192 కోట్లకుపైగా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని