India Corona: అవే హెచ్చుతగ్గులు.. మరోసారి 2 వేలకు పైగా కేసులు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 4.77 లక్షలమందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,364 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Published : 19 May 2022 10:01 IST

98.75 శాతంగా రికవరీ రేటు

దిల్లీ: దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 4.77 లక్షలమందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,364 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తాజాగా కొత్త కేసులు పెరిగి.. మరోసారి రెండు వేల ఎగువకు చేరాయి. నిన్న 2,582 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ 4.31 కోట్లమందికి పైగా కరోనా బారినపడగా.. 4.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 15,419 (0.04 శాతం)గా ఉంది. నిన్న 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. ఈ రెండేళ్ల కాలంలో 191 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.71 లక్షల మంది టీకా తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని