PM Modi: సంక్షోభాల వేళ.. ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపం
ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఉద్ఘాటన
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఖ్యాతి పెరుగుతుందన్న ఆయన.. పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్లోని వడోదరలో ఏర్పాటు చేసిన ‘యువ శివిర్’ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న మోదీ.. యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
‘కరోనా సంక్షోభం వేళ వ్యాక్సిన్లు, ఔషధాలను ప్రపంచ దేశాలకు పంపిణీ చేయడం మొదలు సప్లైచైన్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిన సమయంలోనూ భారత్ కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో శాంతికోసం సమర్థమైన పాత్రను నిర్వహిస్తోన్న భారత్.. నేడు ప్రపంచానికి ఓ ఆశాదీపంగా మారింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వేళ వస్తు సరఫరాలో అంతరాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటితోపాటు యోగా మార్గాన్ని అనుసరించేందుకు ప్రపంచదేశాలకు మనం దారి చూపుతున్నామన్న ఆయన.. ఆయుర్వేద శక్తిని యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నామని చెప్పారు. సమిష్టి నిర్ణయాలతో నూతన భారత్ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పురాతన సంప్రదాయాన్ని అనుసరించి సరికొత్త విధానంలో ముందుకు వెళ్తున్నామన్న మోదీ.. మొత్తం మానవాళికే దిశానిర్దేశం చేసే శక్తిగా భారత్ ఎదుగుతోందని అన్నారు.
వడోదర కరేలీబాగ్, కుండల్ధామ్లలోని శ్రీ స్వామినారాయణ్ దేవస్థానాలు సంయుక్తంగా ‘యువ శివిర్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. సామాజిక సేవ, దేశాభివృద్ధిలో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.