Technology: కొవిడ్ పోరులో ‘సాంకేతికతే’ గేమ్ఛేంజర్..: ఎయిమ్స్ డైరెక్టర్
ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలున్న మన దేశంలో సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే ‘గేమ్ఛేంజర్’గా ఎలా అవుతుందో తాజాగా కొవిడ్ మహమ్మారి మరోసారి నిరూపించిందని ఎయిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు.
టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని మరోసారి నిరూపించిందన్న రణ్దీప్ గులేరియా
దిల్లీ: సాంకేతికత ప్రాముఖ్యాన్ని కొవిడ్ మహమ్మారి మరోసారి తెలియజేసిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల సమస్యలున్న మన దేశంలో సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటే ‘గేమ్ఛేంజర్’గా ఎలా అవుతుందో తాజాగా కొవిడ్ మహమ్మారి మరోసారి నిరూపించిందన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 8వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆరోగ్యవంతమైన దేశం లేకుంటే ఆర్థికవ్యవస్థ, పర్యాటకం, ప్రయాణాలతో పాటు అన్నివిధాలా తీవ్ర నష్టం కలుగుతుందనే విషయాన్ని కొవిడ్ మహమ్మారి చూపించిందన్నారు.
దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చిన భారత్.. అత్యంత వేగంగా టెలీకన్సల్టేషన్ పద్ధతిని అలవరచుకుందని డాక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. తద్వారా ఆస్పత్రులకు రాకుండానే దేశవ్యాప్తంగా ఎంతో మంది రోగులు తక్కువ ఖర్చుతో వైద్య సేవలను పొందారని గుర్తుచేశారు. ఇలాంటి ఎన్నో విభాగాల్లో సాంకేతికత దోహదపడిందని చెప్పారు. ఆరోగ్యం విషయానికొస్తే దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చాలా వ్యత్యాసం ఉందని.. ఈ సమస్యపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇదే వ్యత్యాసాన్ని సాంకేతికత మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సాంకేతికతపై అంత పట్టు లేనివారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని గులేరియా ఉద్ఘాటించారు.
అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్లపై శిక్షణ ఇవ్వడం ద్వారా ఆరోగ్య రంగంపై ఉన్న ఒత్తిడిని భారీగా తగ్గించవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ సూచించారు. ఇందుకోసం పరిశోధనలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు. సాంకేతిక రంగంలో ఇదే అత్యంత ముఖ్యమైన విషయమని గులేరియా పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా చాలా విభాగాల్లో ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని జాతీయ ఆరోగ్య సంస్థ (NHA) సీఈఓ ఆర్ఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!