Jeff bezos: ‘వర్క్ ఫ్రమ్ స్పేస్’ కోసం బెజోస్ యత్నాలు!
కరోనా, లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఎలాగో ఆఫీస్ లేదు.. ఇంట్లో ఉండి ఏం పనిచేస్తాం.. సరదాగా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేద్దామనుకునే వారి కోసం కూడా పలు పర్యటక ప్రాంతాలు, సంస్థలు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్నేళ్లలో
ఇంటర్నెట్ డెస్క్: కరోనా, లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఎలాగూ ఆఫీస్ లేదు.. ఇంట్లో ఉండి ఏం పనిచేస్తాం.. సరదాగా విహారయాత్రకు వెళ్లి అక్కడి నుంచి పనిచేసుకుంటే బాగుండు అని చాలా మంది అనుకొనే ఉంటారు. అలాంటి వారి కోసం పలు పర్యటక ప్రాంతాలు, సంస్థలు ఆఫర్లు కూడా ప్రకటించాయి. అయితే, కొన్నేళ్లలో భూమి మీద కాదు.. అంతరిక్షం నుంచి పనిచేసే వెసులుబాటు రాబోతోంది. ఈ మేరకు అమెజాన్, బ్లూ ఆరిజిన్ సంస్థల అధినేత జెఫ్ బెజోస్ ప్రణాళికలు రచిస్తున్నారు.
బెజోస్ మానస పుత్రికైన బ్లూ ఆరిజిన్ సంస్థ.. సియారా స్పేస్, రెడ్వైర్ స్పేస్, జెనిసిస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ‘ఆర్బిటాల్ రీఫ్’ పేరుతో కమర్షియల్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది. 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ అంతరిక్ష కేంద్రాన్ని బిజినెస్ పార్క్గా తీర్చిదిద్దనున్నట్లు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈ బిజినెస్ పార్క్లో పది మందికి ఆతిథ్యం ఇచ్చేలా స్పేస్ హోటల్, సినిమాలు తీయడానికి స్టూడియో, పరిశోధనల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారట. 2025 తర్వాత ఆర్బిటాల్ రీఫ్కు తొలి అంతరిక్షయానం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో చెప్పడానికి ఆయా సంస్థల ప్రతినిధులు నిరాకరించారు. అయితే, ప్రైవేటు స్పేస్ ఏజెన్సీలు, హైటెక్ సంస్థలు, స్పేస్ ప్రాజెక్టులు లేని దేశాలు, మీడియా, ట్రావెల్ సంస్థలు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టొచ్చని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బెజోస్.. బ్లూ ఆరిజిన్ ప్రయోగాల కోసం ఏటా 1 బిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్