Rajasekhar: నా జీవితం అక్కడితో ముగిసిపోతుందనుకున్నా: రాజశేఖర్
కొవిడ్ వల్ల ఎంతో ఇబ్బందిపడ్డానని, ఒకానొక సమయంలో తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని ప్రముఖ నటుడు రాజశేఖర్ అన్నారు. తన భార్యాబిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే మళ్లీ మామూలు మనిషినయ్యానని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డానని, ఒకానొక సమయంలో తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని ప్రముఖ నటుడు రాజశేఖర్ అన్నారు. తన భార్యాబిడ్డలు ఇచ్చిన ధైర్యంతోనే మళ్లీ మామూలు మనిషినయ్యానని తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆయన సతీమణి జీవిత దర్శకత్వం వహించిన చిత్రమిది. మే 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను విలేకరులతో పంచుకున్నారు. ఆ సంగతులివీ..
* ఎప్పుడూలేనిది ఈ సినిమాను బతికించండని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎందుకు అన్నారు?
రాజశేఖర్: ఇంతకాలం నా దగ్గర ప్రాపర్టీ ఉంది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్నా. ఈ సినిమా విజయం అందుకుంటేనే వాటి నుంచి బయటపడగలను. ఈ పరిస్థితి వల్లే ఆరోజు వేదికపై అలా మాట్లాడాల్సి వచ్చింది. ఈ సినిమా విషయంలో ఎప్పుడూ లేనిది తొలిసారి ఒత్తిడి ఫీలవుతున్నా. ఓ మంచి, విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. వారిని నిరుత్సాహపరచననే నమ్మకం ఉంది. సినిమా బాగుందని తెలిస్తే థియేటర్కు వచ్చి చూడాలని ఆడియన్స్ను కోరుతున్నా.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
రాజశేఖర్: ‘శేఖర్’ చిత్రం నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఇందులోని హీరో పాత్ర భావోద్వేగంతో కూడుకున్నది. నటనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎమోషన్ పండించేందుకు నా వంతు కృషి చేశా. లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్త పడ్డా. 55 ఏళ్ల వ్యక్తి పాత్ర అయినా స్టైలిష్గా కనిపించాలని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ప్రయత్నించా. ఈ గెటప్లో నన్ను చూసినవారంతా చాలా బాగుందని కితాబిచ్చారు. ఇది వర్కౌట్ అవుతుందని అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత మరికొంతమంది మెచ్చుకున్నారు. ఫస్ట్లుక్, ప్రచార చిత్రాలు బాగున్నాయని అంటున్నారు కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం బలపడింది.
* మలయాళ చిత్రం ‘జోసెఫ్’ను ఎందుకు రీమేక్ చేయాలనిపించింది?
రాజశేఖర్: నేను గతంలో నటించిన ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘మా అన్నయ్య’, ‘మా ఆయన బంగారం’, ‘సింహరాశి’, ‘శేషు’ తదితర సినిమాలు రీమేక్గా రూపొందినవే. శేషు మినహా మిగిలిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. రీమేక్ సినిమాల విషయంలో మనం ఏం చేయబోతున్నామో, పాత్ర ఎలా ఉండబోతుందో ముందే తెలుస్తుంది. ఆయా సినిమాలు మాతృకలో సూపర్హిట్ కాబట్టి ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తాయనే మినిమం గ్యారెంటీ ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ‘జోసెఫ్’ను ఎంపిక చేసుకున్నా. ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు కొంచెం మార్పులు చేశాం.
* మీ సతీమణే ఈ సినిమాకు డైరెక్టర్. సెట్స్లో వాతావరణం ఎలా ఉండేది?
రాజశేఖర్: సెట్స్లో డైరెక్టర్- నటుడిగానే ఉండేవాళ్లం. ఓ దర్శకురాలిగా సన్నివేశానికి ఏం కావాలో తను వివరిస్తుంది. ఆ ఇన్పుట్స్ మేరకు నేను నటించేవాడ్ని. ఒక్కోసారి ఇద్దరం చర్చించుకుని, ఎవరి ఆలోచన బాగుంటే అది ఫాలో అయ్యేవాళ్లం. నేనే కాదు ఆయా పాత్రకు సంబంధించిన నటుల నుంచి ప్రతిభను బయటకు తీస్తుంది తను. జీవిత గొప్ప డైరెక్టర్ అని చెప్పగలను.
* మీ తనయ శివానీతో నటించడం ఎలా అనిపించింది?
రాజశేఖర్: ఇందులోని కూతురు పాత్ర కోసం నేను వేరే నటిని తీసుకుందామని చెప్పా. కానీ, జీవిత ఒప్పుకోలేదు. మన ఇద్దరి పిల్లల్లో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుందని వివరించింది. సరే అని ‘మీ ఇద్దరిలో ఎవరు నటిస్తారు’ అని శివానీ, శివాత్మికను అడిగాం. తాను నాతో తర్వాత నటిస్తానని చెప్పి శివాత్మిక తప్పుకుంది. అలా శివానీ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది. తనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది.
* సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ గురించి చెప్తారా?
రాజశేఖర్: ఈ సినిమాకు అనూప్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. డైలాగ్స్ ఉండని కొన్ని సన్నివేశాలను నేపథ్య సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు.
* కొవిడ్ను ఎలా ఎదుర్కొన్నారు?
రాజశేఖర్: నాకు కొవిడ్ వచ్చినప్పుడు చాలా సీరియస్ అయింది. నడవలేకపోయేవాడ్ని. బోర్ కొట్టకుండా ఉండేందుకు నాకోసం ఐసీయూలో టీవీ పెట్టారు. హీరోలు చేసే డ్యాన్స్, పోరాటాలు చూసి నేనూ అలానే ఉండేవాడ్ని కదా ఇలా అయిపోయానేంటనే బాధ మొదలైంది. నా జీవితం ముగిసిపోతుందనే భయం వేసింది. అదే సమయంలో మా అక్క ఫోన్ చేస్తే విషయం చెప్పి ఏడ్చేశా. అప్పుడు నాపై నాకు నమ్మకం లేకపోవడంతో ‘జోసెఫ్’ చిత్ర హక్కులను ఎవరికైనా ఇచ్చేమని జీవితకు చెప్పా. కానీ, ఆమె నేను కోలుకుంటానని ధైర్యానిచ్చింది. జీవిత, పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేను. ఎలా అయినా ఈ సినిమా చేయాలనే కసితో మళ్లీ మామూలు మనిషిని అయ్యా.
* తదుపరి చిత్రాలేంటి?
రాజశేఖర్: ప్రముఖ దర్శకుడితో పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రం చేయబోతున్నా. దాని గురించి ఇప్పుడేం చెప్పలేను. మరోవైపు, మా కుటుంబమంతా కలిసి నటించాలని కొందరు అడుగుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి