Dilraju: థియేటర్లు కళకళలాడతాయి
‘‘బంధాలు, బిజినెస్లు అన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమే ‘ఎఫ్3’. రెండున్నర గంటల సేపు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్రాజు.
‘‘బంధాలు, బిజినెస్లు అన్నీ ఇప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమే ‘ఎఫ్3’. రెండున్నర గంటల సేపు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్రాజు. ఆయన నిర్మాణంలో ‘ఎఫ్2’కు సీక్వెల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే ‘ఎఫ్3’. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించారు. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు దిల్రాజు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘‘ఎఫ్2’ విడుదలకు ముందే అనిల్కు ‘ఎఫ్3’ ఆలోచన వచ్చింది. సరే మొదటిది విజయవంతమైతే సీక్వెల్ చేద్దామని అనుకున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత స్క్రిప్ట్ని పూర్తి చేసి.. నటీనటులందరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చి సినిమా సెట్స్పైకి ఎక్కించాం. ‘ఎఫ్3’ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నామో.. సినిమా చూసిన తర్వాత దానికి మించి నవ్వుకున్నాను. ఇదొక నాన్స్టాప్ ఫన్ రైడ్. థియేటర్లు మునుపటిలా కళకళలాడుతాయి’’.
అంతా కొత్తగానే..
‘‘అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ‘ఎఫ్2’లోని పాత్రల్నే తీసుకొని కొత్త కథని అద్భుతంగా చెప్పాడు. ఒకటి రెండు చోట్ల ‘ఎఫ్2’ గుర్తుకు వస్తుంది తప్ప.. మిగతా అంతా ఫ్రెష్గానే ఉంటుంది. దీంట్లో వెంకటేష్కి రేచీకటి, వరుణ్ తేజ్కు నత్తి. ఇలాంటి అన్నీ కొత్త ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్4’ వస్తుంది. దీనికి సంబంధించి అనిల్ ఇప్పటికే నాకు ఓ పాయింట్ వినిపించాడు. అది త్వరలో ఉంటుంది’’.
పెద్ద చిత్రాలు ప్రకటిస్తాం..
‘‘సినిమా చాలా మారుతోంది. మార్వెల్, అవతార్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే నిలబడుతున్నాయి. ఎన్ని చిత్రాలు చేసినా.. ఇప్పుడంతా అలాంటి భారీ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైంది. దీనికి రాజమౌళి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో శ్రీకారం చుట్టారు. మేమూ ఒక మూడు కథలపై పని చేస్తున్నాం. రెండేళ్లలో ఒకటి, రెండు పెద్ద చిత్రాల్ని మా బ్యానర్ నుంచి ప్రకటించే అవకాశముంది’’.
అందుకే ధరలు తగ్గించాం
‘‘పాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్లు పెరిగాయి. ఇదే సమయంలో ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. మంచి ఫలితాలు సాధించాం. ఇక్కడ మేము పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్కి దూరమవుతున్నారు. రిపీట్ ఆడియెన్స్ తగ్గిపోయారు. టికెట్ ధరలు వారికి అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ‘ఎఫ్3’ అందరి కోసం తీసిన చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. దీన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతోనే పాత జీవో ప్రకారం టికెట్ ధరల్ని తగ్గించాం’’.
దాని వెనుక కథ..
‘‘మొన్న పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు రేట్లు పెరిగాయి. నేను పెంచానని విమర్శించారు. నైజాంలో దిల్రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే పెంచేశాడని సులువుగా అనేస్తారు. తెర వెనుక బోలెడు కథ ఉంటుంది. నిర్మాతలు, హీరోలు.. ఇలా ఎన్నో లెక్కలుంటాయి. అందుకే టికెట్ రేట్లు తగ్గిస్తూ మొదట నేను ఒక అడుగు వేస్తున్నా. ఇది విజయవంతమైతే అందరూ ఇదే ఫాలో అవుతారు’’.
నియంత్రణలో పెట్టుకోలేదు..
‘‘నేను నైజాం మొత్తాన్ని నియంత్రణలో పెట్టుకున్నానని చాలా మంది అంటుంటారు. ఇక్కడ మొత్తం 450 థియేటర్లు ఉంటే.. వాటిలో మా సంస్థకు ఉన్నవి 60. ఆ కొన్నింటితో నేను కంట్రోల్లో పెట్టుకునేది ఏమీ ఉండదు. మా మాట ఎందుకు వింటారంటే.. ఎవరైనా రూపాయి మాకు అడ్వాన్స్గా ఇస్తే.. వాళ్ల డబ్బు జాగ్రత్తగా కాపాడుతాం. అలాగే ఎక్కువ చిత్రాలు చేయడం వల్ల సహజంగానే మాకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రెండు కారణాల వల్లే నేను నంబర్ వన్గా ఉన్నా తప్ప ఏదో నియంత్రణలో పెట్టి కాదు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!