Niharika NM: మహేశ్, యశ్, అజయ్దేవ్గణ్ ఈమె వీడియోలకు ఫిదా.. ఎవరీ నిహారిక ఎన్ఎం?
మహేశ్బాబు, యశ్, అజయ్దేవ్గణ్కే కాదు షాహిద్కపూర్, రకుల్ప్రీత్సింగ్, రెజీనా.. ఇలా టాలీవుడ్ టు బాలీవుడ్ తారలు ఆమె వీడియోలకు అభిమానులు.
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్బాబు, యశ్, అజయ్దేవ్గణ్కే కాదు షాహిద్కపూర్, రకుల్ప్రీత్సింగ్, రెజీనా.. ఇలా టాలీవుడ్ టు బాలీవుడ్ తారలు ఆమె వీడియోలకు అభిమానులు. ఎంతగా అంటే తమ చిత్ర ప్రచారాన్ని ఆమెతో కలిసి చేసేంత. ‘సర్కారు వారి పాట’ కోసం మహేశ్, ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ కోసం యశ్, ‘రన్వే 34’ కోసం అజయ్, ‘జెర్సీ’ కోసం షాహిద్ ఆమెను సంప్రదించారంటే ఆ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరామె అంటారా? ఆ డిజిటల్ క్రియేటర్ ఎవరో కాదు నిహారిక ఎన్ఎం. సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారికి ఈమె సుపరిచితురాలు కావొచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ తెరచినా, ట్విటర్ ఓపెన్ చేసినా తన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. తనను తాను ఓ బ్రాండ్గా మలుచుకున్న నిహారిక ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టైప్స్ అదుర్స్
నిహారిక (24) చెన్నైలో పుట్టింది. బెంగళూరులో పెరిగింది. కాలిఫోర్నియాలో ఎంబీఏ విద్యను అభ్యసించింది. తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో ఆ దిశగానే కెరీర్ను ఊహించుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని, డిజిటల్ బాట పట్టింది. ప్రారంభంలో తన వీడియోలకు ఊహించినంత ఫలితం రాకపోవడంతో అందరిలానే తానూ కాస్త నిరుత్సాహపడింది. అయితేనేం, తన లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలనే బలమైన కాంక్షతో మరో అడుగు ముందుకేసి, ‘నలుగురిలో ఒకరిలా కాకుండా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి’ అనుకుని కామెడీ వీడియోలు తీయడం ప్రారంభించింది. ఇలా ఆమె రూపొందించిన ‘టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ యాన్ ఎగ్జామ్’, ‘టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్ కాలేజ్’ తదితర ‘టైప్’ సిరీస్ వీడియోలు ఆమెకు బాగా పేరు తీసుకొచ్చాయి. ‘టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ యాన్ ఎగ్జామ్’ వీడియోతో కొన్ని గంటల్లోనే 10,000 మంది కొత్త సబ్స్రైబర్లను సొంతం చేసుకోగలిగిందంటే నిహారిక ఎలాంటి కంటెంట్ అందిస్తుందో తెలుస్తోంది. ప్రస్తుతం తన ఛానెల్కు 9.76లక్షలకుపైగా సబ్స్రైబర్లు ఉన్నారు. ఆమె ప్రతిభను మెచ్చి ‘క్రియేటర్స్ ఫర్ ఛేంజ్’ అనే ఇనిషియేటివ్కు నిహారికను వరుసగా మూడుసార్లు గ్లోబల్ అంబాసిడర్గా నియమించుకుంది యూట్యూబ్ సంస్థ.
లక్ష నుంచి 22 లక్షలు..
యూట్యూబ్లో రాణిస్తుండగానే ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి నిహారిక ఎంట్రీ ఇచ్చింది. స్వీట్ అండ్ షాట్ ఫన్నీ వీడియోలతో కొన్ని కోట్లమంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఒక్కోమెట్టు ఎక్కే క్రమంలో ఆమె చేసిన ‘లివింగ్ ఎలోన్ 101’ అనే వీడియో వైరల్ అవడమేకాకుండా 13 రోజుల్లో 11 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ను సంపాదించిపెట్టింది. ఆ వీడియోకు వచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వైవిధ్యభరిత స్కిట్స్ను రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. అలా ఆ నోటా ఈ నోటా నిహారిక వీడియోల గురించే అంతా చర్చించుకునేవారు. తన కామెడీ చూసి కడుపుబ్బా నవ్వుకునేవారు. ప్రస్తుతం నిహారికను అనుసరిస్తున్న వారి సంఖ్య 2.2 మిలియన్కుపైగానే. వీరిలో సినీ ప్రముఖులెందరో ఉన్నారు.
వదిలేద్దామనుకున్న స్థితి నుంచి
‘‘కెమెరా ముందు నటించడమంటే నాకు చాలా ఇష్టం. నా చుట్టూ ఉన్నవారిని నవ్వించడం నాకు సరదా. వీడియోలు రూపొందిచడంలో నా కుటుంబం, స్నేహితులు నన్నెంతగానో ప్రోత్సహించారు. అలా అని నేను చదువునెప్పుడూ అశ్రద్ధ చేయలేదు. ఓ డిగ్రీ సంపాదించుకున్నాకే పూర్తిగా ఇటువైపు వచ్చా. అందరికీ ఎదురైనట్టే నాపైనా ట్రోల్స్ వస్తుంటాయి. నేను వాటిని పట్టించుకోను. పాజిటివ్ కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇంకెంత బాగా చేయాలో దాని గురించే ఆలోచిస్తుంటా. ఒకానొక సమయంలో సోషల్ మీడియాను వద్దిలేద్దాం అనుకున్న స్థితి నుంచి ఈ స్థాయికి చేరుకున్న నా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటుంటే భావోద్వేగానికి గురవుతా’’ అని ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది నిహారిక. ఇంతమంది యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు ఉండగా ఈమెనే ఎందుకంత ప్రత్యేకం అనుకుంటుంటే కింది వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ