Andhra News: తుగ్లక్‌ కూడా నవ్వుకునేలా జగన్‌ పాలన: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

సీఎం జగన్‌ పాలన తుగ్లక్‌ కూడా నవ్వుకునేలా ఉందని వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయట పడేసేందుకే రాజ్యసభ సీట్లు

Published : 19 May 2022 02:23 IST

కమలాపురం: సీఎం జగన్‌ పాలన తుగ్లక్‌ కూడా నవ్వుకునేలా ఉందని వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయట పడేసేందుకే రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కమలాపురంలో నిర్వహించిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడారు. 

నిరంజన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ఏపీలో ఏ జిల్లాకు చెందిన వారని శివారెడ్డి నిలదీశారు. తెలంగాణకు చెందిన వారికి రెండు రాజ్యసభ సీట్లు ధారాదత్తం చేశారని ఆక్షేపించారు వైకాపాలో రాజ్యసభకు అర్హులైన నాయకులు లేనందునే తెలంగాణ నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బటన్‌ నొక్కి నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్న జగన్‌.. ఆ పథకాలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో సర్వే చేయించుకోవాలని సూచించారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శివారెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు