Sunil Jakhar: భాజపాలో చేరిన సునీల్ జాఖఢ్
సీనియర్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖఢ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖఢ్ కాషాయ కండువా కప్పుకున్నారు
దిల్లీ: కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖఢ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. గురువారం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖఢ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నడ్డా ఆయనకు సాదర స్వాగతం పలికారు. జాఖఢ్ ఎంతో అనుభవమున్న రాజకీయ నేత అని నడ్డా కొనియాడారు. పంజాబ్లో పార్టీ బలోపేతమవడంతో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం జాఖఢ్ మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా తమ కుటుంబంలోని మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశామని గుర్తుచేశారు. అయితే జాతీయవాదం, ఐకమత్యం తదితర అంశాల కారణంగా కాంగ్రెస్తో ఉన్న బంధాన్ని తాను తెంచుకున్నట్లు చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ను వీడలేదని, పంజాబ్ను రక్షించేందుకే తాను ఆ పార్టీ నుంచి వైదొలిగినట్లు తెలిపారు.
సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించి..
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీని లక్ష్యంగా చేసుకుని సునీల్ జాఖఢ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ ఛానల్లో జాఖఢ్ మాట్లాడుతూ.. అమరీందర్ రాజీనామా తర్వాత ఆ స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం చన్నీని నియమించడాన్ని ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జాఖఢ్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కూడా ఆయన చన్నీపై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే ఆయనపై కొందరు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. దీంతో, జాఖఢ్ను రెండేళ్ల పాటు అన్ని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో అసంతృప్తి చెందిన జాఖఢ్ ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత సీఎం రేసులో జాఖఢ్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఎన్నికల దృష్ట్యా సిక్కు వ్యక్తిని సీఎం చేయాలని కొందరు పార్టీ నేతలు సూచించడంతో చన్నీని ముఖ్యమంత్రిగా నియమించారు. అప్పటి నుంచే జాఖఢ్ కలత చెందారని తెలుస్తోంది.
వారి కుటుంబం.. 50 ఏళ్లుగా కాంగ్రెస్తోనే..
జాఖఢ్ కుటుంబం 50 ఏళ్లుగా కాంగ్రెస్కు పనిచేస్తోంది. సునీల్ తండ్రి బలరాం జాఖఢ్ కాంగ్రెస్ తరఫున మూడు సార్లు లోక్సభకు ఎన్నికవ్వడమే గాక.. రెండు పర్యాయాలు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 1980 నుంచి 1989 మధ్య వరుసగా తొమ్మిదేళ్ల పాటు సభాపతిగా ఉన్న ఆయన.. లోక్సభకు సుదీర్ఘకాలం స్పీకర్గా పనిచేసిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. పీవీ నరసింహరావు హయాంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్కు గవర్నర్గా వ్యవహరించారు. ఇక సునీల్ జాఖఢ్ పంజాబ్లోని అబోహర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. -
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. -
జనసేనకు పవన్కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. -
శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. -
10 రోజులకే మార్చారు!
వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్ అందులో మళ్లీ మార్పులు చేశారు. -
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్తో విజయసాయిరెడ్డికి సంబంధం
మాదకద్రవ్యాలతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్ ఈస్ట్ కంటెయినర్తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
8 మంది ఎవరో?
లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. -
మొన్నటివరకు చెట్లు తొలగించారు.. ఇప్పుడు ఇళ్లు పీకేస్తారు
‘ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు. -
రేణిగుంట కేంద్రంగా వైకాపా ప్రలోభాల వల
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా తాయిలాలు అందిస్తున్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
-
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్గా మారిన ఫొటో
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి