Chandrababu: పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం: చంద్రబాబు

వైకాపా పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 19 May 2022 15:01 IST

కర్నూలు: వైకాపా పాలనలో వేధింపులు, అప్పులు విపరీతంగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు చేశారన్న చంద్రబాబు.. తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురువారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాలి. ఒంగోలు మహానాడు ద్వారా చర్చించుకుందాం. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్నేమి చేయలేరు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మేం కన్నెర్రజేస్తే జగన్‌ తట్టుకోలేరు. బీసీ జనార్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. అవినీతి కేసులున్న వ్యక్తి మాపై కేసులు పెడతారా? పైశాచిక ఆనందం పొందుతున్న వ్యక్తికి గుణపాఠం చెబుతాం. రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. కర్నూలుకు హైకోర్టు ఎందుకు తరలించలేదు. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని