Telangana News: పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పని ఎలా అంటారు?: ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సరం యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది యాసంగిలో నిన్నటి వరకు కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందున రైతులు రూ.1,400కే అమ్ముకోవాల్సి వచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం తప్పని సీఎం కేసీఆర్ ఏలా అంటారని ఉత్తమ్ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలు బలపడాలని నేరుగా నిధులు ఇచ్చే విధానాన్ని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పంచాయతీలకు వచ్చే నిధులు పెంచాలని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తీరుతో తెలంగాణలో సర్పంచ్ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్