Jasprit Bumrah: టీ20 క్రికెట్లో జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు
టీమ్ఇండియా, ముంబయి ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అటు అంతర్జాతీయ టీ20ల్లో, ఇటు భారత టీ20 క్రికెట్లో మొత్తం 250 వికెట్లు పడగొట్టాడు...
(Photo: Jasprit Bumrah Instagram)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా, ముంబయి ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అటు అంతర్జాతీయ టీ20ల్లో, ఇటు భారత టీ20 క్రికెట్లో మొత్తం 250 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఇన్నింగ్స్ చివరి బంతికి బుమ్రా.. వాషింగ్టన్ సుందర్ను బౌల్డ్ చేశాడు. దీంతో పొట్టి క్రికెట్లో అతడు మొత్తం 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అతడి తర్వాత హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 223 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా జయదేవ్ ఉనద్కత్ 201 వికెట్లతో మూడు, మాజీ పేసర్ వినయ్ కుమార్ 194 వికెట్లు సాధించి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
బుమ్రాను అధిగమించిన ఉమ్రాన్
(Photo: Umran Malik Instagram)
మరోవైపు హైదరాబాద్ యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఇదే మ్యాచ్లో బుమ్రాకు చెందిన ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి 20 ఓవర్ల పూర్తికోటా ఆడి 190/7 పరుగులకు పరిమితమైంది. దీంతో స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఉమ్రాన్ ఆ జట్టులోని 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (43)తో పాటు ప్రమాదకర డేనియల్ సామ్స్ (15), తిలక్ వర్మ(8)లను వెనక్కి పంపాడు. దీంతో అతడు ఈ సీజన్లో మొత్తం 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ భారత టీ20 టోర్నీలో 2017 సీజన్లో పిన్న వయస్కుడిగా బుమ్రా (20) తీసిన అత్యధిక వికెట్ల రికార్డును ఉమ్రాన్ అధిగమించాడు.
* ఉమ్రాన్ మాలిక్ - 22 ఏళ్ల 176 రోజుల్లో 21 వికెట్లు (2022)
* జస్ప్రిత్ బుమ్రా - 23 ఏళ్ల 165 రోజుల్లో 20 వికెట్లు (2017)
* ఆర్పీ సింగ్ - 23 ఏళ్ల 166 రోజుల్లో 23 వికెట్లు (2009)
* ప్రజ్ఞాన్ ఓజా - 23 ఏళ్ల 225 రోజుల్లో 21 వికెట్లు (2010)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.