Rohit Sharma: డేవిడ్ రనౌట్ అయ్యే వరకు గేమ్లో ఉన్నామనుకున్నా: రోహిత్
టిమ్డేవిడ్ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్లో ఉన్నామని అనుకున్నానని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ల...
ముంబయి: టిమ్డేవిడ్ క్రీజులో ఉన్నంతవరకు తాము మ్యాచ్లో ఉన్నామని అనుకున్నానని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతరాత్రి హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 194 పరుగుల భారీ ఛేదనలో ముంబయి కేవలం 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చివరిబంతి వరకూ పోరాడిన రోహిత్సేన విజయపుటంచుల దాకా వెళ్లి బోల్తాపడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ టిమ్డేవిడ్ రనౌట్ దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు.
‘18వ ఓవర్ దాకా మ్యాచ్ మాదే అనుకున్నాం. కానీ, డేవిడ్ రనౌట్ దురదృష్టకరం. అప్పటి వరకు మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నా. హైదరాబాద్ జట్టుకు అభినందనలు. వాళ్లకు పూర్తి క్రెడిట్ దక్కుతుంది. చివరివరకూ ఊపిరిబిగబట్టి ఆడారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మా జట్టులో కొంతమంది యువకులతో ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్ చేయించాలనుకున్నాం. అందుకే ప్రయోగాలు చేశాం. అయితే, హైదరాబాద్ బ్యాట్స్మెన్ బాగా ఆడారు. దీంతో మా బౌలింగ్ తడబడింది. బ్యాట్తో రాణించి చివరివరకూ మ్యాచ్ను తీసుకెళ్లినా గెలుపొందలేకపోయాం. ఇకపై ఆడాల్సిన చివరి మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి విజయంతో ముగించాలనుకుంటున్నాం. వీలైతే కొంతమంది యువకులకు ఆడే అవకాశం కల్పిస్తాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.
కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రియమ్గార్గ్ (42), రాహుల్ త్రిపాఠి (76), నికోలస్ పూరన్ (38) దంచికొట్టారు. అనంతరం ముంబయి ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43), టిమ్ డేవిడ్ (46) రాణించారు. అయితే, 17 ఓవర్లకు ముంబయి 149/5తో నిలిచి ఓటమిపాలయ్యేలా కనిపించినా 18వ ఓవర్లో డేవిడ్ దంచికొట్టాడు. నటరాజన్ వేసిన ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు సంధించడంతో పాటు రెండు వైడ్లు రావడంతో ముంబయి మొత్తం 26 పరుగులు రాబట్టింది. కానీ, అదే ఓవర్ చివరి బంతికి డేవిడ్ అనవసర పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. తర్వాత హైదరాబాద్ పుంజుకొని ముంబయిని 190/7కి పరిమితం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..