T20 League : అమెరికాలో తొలి ప్రొఫెషనల్ టీ20 లీగ్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పెట్టుబడి
అమెరికా వ్యాప్తంగా క్రికెట్కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్ టీ20 లీగ్ అయిన ...
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వ్యాప్తంగా క్రికెట్కూ ఆదరణ పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి జరగబోయే ఫ్రొఫెషనల్ టీ20 లీగ్ అయిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో పెట్టుబడి పెట్టేందుకు ప్రవాస భారతీయ దిగ్గజాలు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ కూడా నిధులు అందించారు. సిరీస్ A, A1 నిధుల సేకరణ పూర్తైనట్లు అమెరికా వ్యాపారవేత్తల బృందం ప్రకటించింది. మేజర్ లీగ్ కోసం 120 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే తొలి రెండు సిరీస్ల కోసం 44 మిలియన్ డాలర్లను సేకరించినట్లు వెల్లడించింది. మిగతా మొత్తం (76 మిలియన్ డాలర్లు) వచ్చే ఏడాదిలోపు ఫండ్రైజింగ్ ద్వారా సేకరిస్తామన్నారు.
సిరీస్ A, సిరీస్ A1 రౌండ్ ఫండ్ రైజింగ్కు సత్య నాదెళ్ల నాయకత్వం వహించారు. ‘‘అమెరికాలో క్రికెట్ వ్యాప్తి కోసం, సదుపాయాల కల్పన కోసం ఫండ్ రైజింగ్ చేపట్టాం. దీని కోసం అత్యుత్తమ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కమిటీ పని చేసింది. ప్రపంచస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ను అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇన్వెస్టర్ గ్రూప్లో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలను నడిపించే వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వారి మార్గదర్శకత్వంలో అమెరికాలో తొలి టీ20 లీగ్ను విజయవంతం చేస్తాం. అలానే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేలా ప్రయత్నిస్తాం’’ అని మేజర్ లీగ్ సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ తెలిపారు.
ఫండ్ రైజ్ ద్వారా వచ్చే 120 మిలియన్ డాలర్లను క్రికెట్ మైదానాలు, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో అమెరికా నుంచి స్టార్ క్రికెటర్లు వచ్చేలా చూస్తామని సహ వ్యవస్థాపకులు వెల్లడించారు. వచ్చే ఏడాది టీ20 లీగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ సభ్య దేశమైన అమెరికా తమ దేశంలో టీ20 క్రికెట్కు ఆదరణ పెంచేందుకు మేజర్ లీగ్ క్రికెట్ (mlc)ని పార్టనర్గా ఎంపిక చేసుకుంది. యూఎస్ఏ పురుషుల, మహిళల జట్లకు ఎంఎల్సీ మద్దతుగా నిలవనుంది. 2024లో విండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ పోటీలకు అమెరికా కూడా కో-హోస్ట్గా ఉండనుంది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో తమ అమెరికాలో టీ20 క్రికెట్ వృద్ధి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సత్య నాదెళ్ల, శంతను నాయణ్ కాకుండా మాడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సోమసేగర్, మిల్లివేస్ వెంచర్స్ అండ్ రాకెట్షిప్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ రాజారమణ్, వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఛైర్మన్ జైతర్ సంజయ్ గోవిల్, మేనేజింగ్ పార్టన్ పెరోట్ జైన్ తదితరులు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఫండ్ అందించారు. ఏ ఇన్వెస్టర్ ఎంత ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు