Bangalore Vs Gujarat : బెంగళూరు గెలిచెన్.. అయినా దిల్లీ చేతిలోనే ప్లేఆఫ్స్ ఛాన్స్!
ప్లేఆఫ్స్ కుర్చీలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు జట్లు స్థానం సంపాదించాయి. ఇక మిగిలిన రెండింటి కోసం ఐదు జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో ..
ముంబయి: కీలక మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ నిర్దేశించిన 169 పరగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (73) అర్ధశతకం సాధించగా.. డుప్లెసిస్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్కు చేరినా.. బెంగళూరు విజయం సాధించిందంటే దానికి కారణం గ్లెన్ మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్). చివరి వరకు దూకుడుగా ఆడి బెంగళూరును గెలుపు తీరాలకు చేర్చాడు. దీంతో 18.3 ఓవర్లలో 170 పరుగులు చేసి బెంగళూరు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లను పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 168/5 స్కోరు సాధించింది.
ప్రస్తుతం బెంగళూరు 14 మ్యాచులకుగాను 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే దిల్లీ తన ఆఖరి మ్యాచ్లో ముంబయిపై విజయం సాధిస్తే మాత్రం బెంగళూరు ఇంటిముఖం పట్టక తప్పదు. ఒకవేళ దిల్లీ ఓడితే మాత్రం బెంగళూరు ప్లేఆఫ్స్ వెళ్లినట్లే. మరోవైపు బెంగళూరు గెలవడంతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఫలితం సంబంధం లేకుండా పంజాబ్, హైదరాబాద్ ఇంటిముఖం పట్టాయి. ఈ మ్యాచ్లో ఓడిపోయినా గుజరాత్ నష్టమేమీ లేదు. అగ్రస్థానంతోనే లీగ్ దశను ముగించింది.
రసవత్తరంగా మ్యాచ్
బెంగళూరు, గుజరాత్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (63*), డుప్లెసిస్ (42*) శతక భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు ఎంత శ్రమించినా వికెట్ మాత్రం దక్కడం లేదు. బెంగళూరు విజయం సాధించాలంటే ఇంకా 36 బంతుల్లో 56 పరుగులు సాధించాలి.
నిలకడగా బ్యాటింగ్..
బెంగళూరు లక్ష్యం దిశగా సాగుతోంది. గుజరాత్ బౌలింగ్ సమర్థంగా ఎదుర్కొంటూ వికెట్ ఇవ్వకుండా ఆడుతోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (44*), డుప్లెసిస్ (27*) నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. బెంగళూరు విజయం సాధించాలంటే 66 బంతుల్లో 92 పరుగులు చేయాలి.
ఛేదన ప్రారంభం..
కీలకమైన మ్యాచ్లో బెంగళూరు లక్ష్య ఛేదనను ప్రారంభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (11*), డుప్లెసిస్ (9*) ఆచితూచి ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. బెంగళూరు విజయానికి 102 బంతుల్లో 143 పరుగులు కావాలి. తొలుత బ్యాటింగ్ గుజరాత్ ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
బెంగళూరు లక్ష్యం ఎంతంటే?
కెప్టెన్ హార్దిక్ పాండ్య (62*), డేవిడ్ మిల్లర్ (34), వృద్ధిమాన్ సాహా (31), రషీద్ ఖాన్ (19*), మ్యాథ్యూ వేడ్ (16) ధాటిగా ఆడటంతో బెంగళూరుకు లఖ్నవూ ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 169 పరుగులను లక్ష్యంగా ఉంచింది. శుభ్మన్ గిల్ (1), రాహుల్ తెవాతియా (2) విఫలమ్యారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్వుడ్ 2.. గ్లెన్ మ్యాక్స్వెల్, హసరంగ చెరో వికెట్ తీశారు.
నెమ్మదించిన స్కోరు బోర్డు
గుజరాత్ స్కోరు బోర్డు నెమ్మదించింది. బెంగళూరు బౌలర్లు వికెట్లను తీయకపోయినా పరుగులను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ (24*), హార్దిక్ పాండ్య (35*) ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు 47 పరుగులను జోడించారు. మ్యాక్స్వెల్ వేసిన 14వ ఓవర్లో డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు సిక్సర్లను బాదాడు. లేకపోతే గుజరాత్ స్కోరు ఇంకా తక్కువగా ఉండేది.
ఆచితూచి ఆడుతూ..
బెంగళూరు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో గుజరాత్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ (2*), హార్దిక్ పాండ్య (13*) ఉన్నారు. అంతకుముందు దూకుడుగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహా (31) రనౌటయ్యాడు. డుప్లెసిస్ డైరెక్ట్గా వికెట్లకు త్రో విసరడంతో సాహా పెవిలియన్కు చేరాడు. మ్యాథ్యూ వేడ్ (16)ను మ్యాక్స్వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఇన్నింగ్స్ ప్రారంభం..
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్నవూ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ శుభ్మన్ గిల్ (1) పెవిలియన్కు చేరాడు. హేజిల్ వుడ్ బౌలింగ్లో స్లిప్లో మ్యాక్స్వెల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అయితే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (19*) దూకుడుగా ఆడుతున్నాడు. బెంగళూరు బౌలర్ సిద్ధార్థ్ కౌల్ వేసిన తొలి ఓవర్లోనే 14 పరుగులను రాబట్టాడు. అనంతరం రెండో ఓవర్ను షాహ్బాజ్ కట్టుదిట్టంగా వేశాడు. ఈ ఓవర్లో ఆరు రన్స్ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజ్లో సాహాతోపాటు మ్యాథ్యూ వేడ్ ఉన్నాడు.
టాస్ నెగ్గిన హార్దిక్
ప్లేఆఫ్స్ కుర్చీలాట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు జట్లు స్థానం సంపాదించాయి. ఇక మిగిలిన రెండింటి కోసం ఐదు జట్లు రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో మరికాసేపట్లో బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకుని బెంగళూరుకు బౌలింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. దినేశ్ కార్తిక్ ఎలానూ లోయర్ఆర్డర్లో రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో టాప్ఆర్డర్ బ్యాటర్లు ఆడితే బెంగళూరు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు ఇప్పటికే అగ్రస్థానంతో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న గుజరాత్ లీగ్ దశను విజయంతోనే ముగించాలని భావిస్తోంది.
జట్ల వివరాలు :
బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), రాజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్, షాహ్బాజ్ అహ్మద్, వహిండు హసరంగ, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ కౌల్, జోష్ హేజిల్వుడ్
గుజరాత్: వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, మ్యాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, లాకీ ఫెర్గూసన్, యాష్ దయాల్, షమీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా