T20 World Cup: పాక్ ఓటమితో మైదానంలో కన్నీటి పర్యంతమైన అభిమాని.. వీడియో వైరల్
మమూలుగా ద్వైపాక్షిక సిరీస్ల్లోని మ్యాచ్ల్లో తమ అభిమాన జట్టు ఓటమిపాలైతేనే చాలామంది జీర్ణించుకోలేరు. ఇటువంటి సాధారణ మ్యాచ్ల్లో ఓడిపోతేనే అభిమానులు మైదానంలో కంటతడి పెట్టిన సందర్భాలున్నాయి. మరికొంత మంది ఏకంగా
ఇంటర్నెట్ డెస్క్: మమూలుగా ద్వైపాక్షిక సిరీస్ల్లోని మ్యాచ్ల్లో తమ అభిమాన జట్టు ఓటమిపాలైతేనే చాలామంది జీర్ణించుకోలేరు. మైదానంలోనే కంటతడి పెడుతుంటారు. ఇలాంటి ఘటనలు చాలు వారికి తమ అభిమాన జట్టుపై ఎంతంటి ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పడానికి. అలాంటిది ఐసీసీ టోర్నీలో ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో మనం అమితంగా ఆరాధించే టీం పరాజయం పాలైతే తట్టుకోవడం ఏ దేశ క్రికెట్ అభిమానికైనా చాలా కష్టమైన పని. అయితే.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీస్లో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ వైపే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, అప్పుడు క్రీజులో ఉన్న స్టాయినిస్, మాథ్యూ వేడ్ గేర్లు మార్చి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. గెలుస్తుందనుకున్న పాకిస్థాన్కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఒక ఓవర్ మిగిలుండగానే 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో పాక్ ఫైనల్కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. విజయం సాధిస్తుందనకున్న పాక్ అనుహ్యాంగా ఓటమిపాలుకావడంతో మైదానంలో ఉన్న మోమిన్ సాకిబ్ అనే ఆ దేశ క్రికెట్ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
‘‘ఇప్పుడు ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయింది కాబట్టి సహజంగానే నాకు బాధ కలుగుతుంది. కానీ, మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. వరుస మ్యాచ్ల్లో గెలిచారు. జట్టుపై నాకు ఎలాంటి కోపం లేదు. వాళ్లు మా ఛాంపియన్లు. వాళ్లంటే మాకెంతో ఇష్టం. ఈ మ్యాచ్లోనూ బాగా ఆడారు. ఏదేమైనా మేం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాం’ అని మోమిన్ సాకిబ్ ఆ వీడియోలో అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.